గ్రామీణ రహదారులకు మహర్దశ

గ్రామీణ రహదారులకు మహర్దశ

పంచాయతీ నిధులతో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు మంజూరు సర్పంచ్ ఆరబట్ల నాగమ్మ
అభివృద్ధిలో దూసుకుపోతున్న గేజ్జహళ్ళి గ్రామ సర్పంచ్
గత వైసిపి పాలనలో అధ్వానంగా మారిన వైనం కూటమి ప్రభుత్వంలో నిధుల వరద

హొళగుంద,న్యూస్ వెలుగు: కూటమి ప్రభుత్వంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టింది.గత వైసిపి ప్రభుత్వంలో స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయి.గ్రామాల్లో ఒక రోడ్డు నిర్మాణం కూడా చేపట్టలేదు.దీంతో గ్రామాల్లోని రహదారులు గుంతల మయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్లెలకు పండగ వాతావరణం తీసుకొచ్చారు.పల్లె పండుగ పేరుతో గ్రామాల్లోని అంతర్గత రోడ్లు సైడు కాలువలు నిర్మాణాలతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.ఆలూరు నియోజకవర్గం టిడిపి ఇంచార్జీ వీరభద్ర గౌడ్ ప్రత్యేక కృషితో మండలం పరిధిలోని గజ్జహళ్ళి గ్రామ పంచాయతీలో కందారమ్మ గుడి దగ్గర ఎస్సీ కాలనీలో సిసి రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి.గత వైసిపి ప్రభుత్వంలో నిధులు మంజూరు కాక ఆ పార్టీ సర్పంచ్లు కూడా అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో పంచాయతీలోని రహదారులు సైడ్ కాలువలు పనులు జరుగుతుండడంతో గత పదవీకాలం ముగిసేలోపు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని గేజ్జహల్లి గ్రామ సర్పంచ్ ఆరుబట్ల నాగమ్మ అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ రంగస్వామి,సర్పంచ్ తనయుడు గిరిమల్లప్ప,పూజారి రామలింగ,దాసరి రాము, గాదిలింగ,బక్షు రహిమాన్,రంగప్ప,జనసేన నాయకులు అరుణ్ బాషా, తాయప్ప తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!