
పోలీసుల సమర్థవంతమైన సిబ్బందితో 2024లో నేరాలు గణనీయంగా నేరాల తగ్గుదల
పోలీస్ శాఖలో సమర్థవంతమైన సిబ్బంది పనితీరు,మెరుగైన పోలీసింగ్ తో నేరాల తగ్గుదల
జిల్లా ఎస్పి జి.బిందు మాధవ్
35. 85 శాతం ఈ సంవత్సరం క్రైమ్ రేట్ తగ్గింది
న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూల్ జిల్లా నందు పోలీసులు సమర్థ వంతంగా పని చేయడం వల్లే 2024లో నేరాలు గణనీయంగా తగ్గాయని పోలీసులు కలిసి కట్టుగా పని చేయడం వలనే సాధ్యమైoదని జిల్లా ఎస్పి శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ గారు 2024 నేర గణాంకాల ను జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం మీడియాకు తెలియచేశారు.
నేర గణాంకాలు
1) నేరాల తగ్గుదల:
2023 లో నమోదైన కేసులు 7,877 నమోదు కాగా, 2024లో 5,053కేసులు నమోదు అయినవి. 2024 లో 35.85 శాతం ఈ సంవత్సరం క్రైమ్ రేట్ తగ్గింది.
2) హత్యలు, హత్యాయత్నం,కిడ్నాప్ కేసులు:
2023 లో38 హత్య కేసులు, 2024లో 31 హత్య కేసులు,2023 లో 48 హత్యాయత్నం కేసులు, 2024లో 39 హత్యాయత్నం కేసులు, 2023 లో15 కిడ్నాప్ కేసులు,2024లో 15 కిడ్నాప్ కేసులు నమోదు అయినవి, గత సంవత్సరo తో పోల్చుకుంటే తగ్గుముఖం పట్టాయి.
3) ప్రాపర్టీ నేరాలు:
2024 లో మొత్తం ప్రాపర్టీ Rs. 5,65,02791 కోల్పోయింది. రికవరీ Rs.3,67,54,902 ( 65.05 శాతం) రికవరీ చేయడమైనది.
డెకాయిటి:
2023లోఎలాంటి కేసులు నమోదు కాలేదు. 2024లో 1 కేసు నమోదు అయినది.
రాబరీ :-
2023లో 2 కేసులు, 2024లో 4 కేసులు నమోదు అయినవి.
దొంగతనాలు:
2023లో 149 కేసులునమోదు అయినవి,2024లో138కేసులు నమోదు అయినాయి.గత సంవత్సరo తో పోల్చుకుంటేతగ్గుముఖంపట్టాయి.
పగటి దొంగతనాలు:-
2023లో 27 కేసులు నమోదు కాగా,2024లో 25 కేసులు నమోదు అయినాయి.గత సంవత్సరo తో పోల్చుకుంటే 7.41 % తగ్గుముఖంపట్టాయి.
రాత్రి దొంగతనాలు:-
2023లో 122కేసులునమోదు కాగా,2024లో 113 కేసులు నమోదు అయినాయి. గత సంవత్సరo తో పోల్చుకుంటే 7.83% తగ్గుముఖంపట్టాయి.
4) రోడ్డు ప్రమాదాలు:
2023లో 499రోడ్డు ప్రమాదాలు, 2024 లో 523ప్రమాదాలు జరిగాయి. బ్లాక్ స్పాట్ ల గుర్తించి శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాము.
5) మహిళల పై అఘాయిత్యాలు:
2023లో 1 వరకట్న మరణం కేసు, 2024లో 1 వరకట్న మరణం కేసు నమోదు అయినది. 2023 లో 12 అత్యాచార కేసులు, 2024లో 10 కేసులు నమోదు అయినవి.2023 లో 22 పోక్సో గ్రేవ్ కేసులు, 2024లో 30 పోక్సో గ్రేవ్ కేసులు నమోదు అయినవి. 2023 లో 22 పోక్సో నాన్ గ్రేవ్ కేసులు, 2024లో 32 పోక్సో నాన్ గ్రేవ్ కేసులు నమోదు అయినవి.
6)154 బాలికల మిస్సింగ్ కేసుల్లో 147 చేధించాం. 244 మహిళల మిస్సింగ్ కేసుల్లో 232 చేధించాం( ట్రేస్ చేశాం).
7) SC/ST లపై నేరాలు:
2023లో 152 కేసులు, 2024లో 118 కేసులు . 22.37% తగ్గుముఖం పట్టాయి.
8) సైబర్ నేరాలు :
2023లో 41 కేసులు, 2024లో 104 కేసులు నమోదుఅయినాయి. Rs. 56,37,000/-ఫిర్యాదుదారుల ఖాతాలకు రీ-ఫండ్ చేయబడింది.మొత్తం Rs. 2,10,00,000/-వివిధ బ్యాంకుల్లో Freezeచేయబడ్డాయి.
9) సోషల్ మీడియానేరాలు :
2024 లో 56 కేసులు నమోదుఅయినాయి.
10) పబ్లిక్ గ్రీవెన్స్ :
2024 లో 1181 పిర్యాదులు వచ్చినాయి, 970 పిర్యాదులు పరిష్కారం అయినవి .
11) లోక్ అదాలత్ లో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారం:
2024లో 4 విడతలు గా జరిగిన లోక్ అదాలత్ లో 3220 కేసులను పరిష్కరించడం జరిగింది. కర్నూలు జిల్లా కు 3 వ లోక్ అదాలత్ లో రాష్ట్రంలోనే 3 వ స్థానం , 4 వ లోక్ అదాలత్ లో రాష్ట్రంలోనే మొదటి స్ధానం లభించింది.
12) మొబైల్ రీకవరీ మేళా:
బాధితులు పొగొట్టుకున్న మొత్తం 587 మొబైల్స్ ఫోన్ల ను రికవరీ చేసి రికవరీ మేళాలో బాధిత ప్రజలకు అందజేశారు. వాటి విలువ 1.34 Crores )మొబైల్ ఫోన్ పోతే http://Kurnoolpolice.in/mobiletheft లింకు ను క్లిక్ చేసి మొబైల్ వివరాలను తెలియజేస్తే బాధితులకు త్వరితగతిన అందజేసేందుకు కృషి చేస్తాం.
13) సిసికెమెరాలు:
జిల్లాలో నేరాలు జరిగే ప్రదేశాలను గుర్తించి దాతాల సహాకారం తో 5 వేల CCTVలను ఏర్పాటు చేయడానికి సిధ్దం చేశాం. ప్రతి పోలీసుస్టేషన్ కి ఒక డ్రోన్ కెమెరా ఉండే విధంగా కృషి చేస్తున్నాం.
14) NDPS Cases:-
2024 లో 09 కేసులు నమోదు అయినవి. 33 మందిని అరెస్ట్ చేసి, 55.38 కేజి గంజాయి ని సీజ్ చేయడం అయినది .
15) ENFORCEMENT WORK :
Minor DrivingCases:
2024 లో 3,631 మైనర్ కేసులు,Rs.19,42,585/- జరిమానా విదించడం జరిగినది.
MV Act Cases:
2024 లో63,626 కేసులు , Rs.2,40,38,723/- జరిమానా విదించడం జరిగినది.
Drunk & DriveCases:
2024 లో 1,225 కేసులు నమోదు అయినవి.
AP Prohibition (ID) Cases:
2024 లో 356 కేసులు , 515 మంది అరెస్ట్ చేసి, 30 వాహనాలు, 6,962 లీటర్స్ నాటు సారా ను సీజ్ చేయడం అయినది.
AP Excise (NDPL) Cases:
2024 లో 736 కేసులు , 951 మందిని అరెస్ట్ చేసి, 217 వాహనాలు , 21,357 లీటర్స్ లిక్కర్ ను సీజ్ చేయడం అయినది .
Matka:
2024 లో 65 కేసులలో 162 మందిని అరెస్ట్ చేసి Rs.7,22,542/- సీజ్ చేయడం అయినది.
Gambling :
2024 లో 252 కేసులలో 1,251 మందిని అరెస్ట్ చేసి Rs.72,93,283/- సీజ్ చేయడం అయినది.
Cricket Betting:
2024 లో 03 కేసులలో 31 మందిని అరెస్ట్ చేసి Rs.6,50,300/- సీజ్ చేయడం అయినది.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. హుస్సేన్ పీరా, డిఎస్పీలు, సిఐలు పాల్గొన్నారు.