
మాంటిస్సోరి ఏ క్యాంపు లో ఘనంగా జరిగిన వండర్ కార్నివాల్
న్యూస్ వెలుగు, కర్నూలు; నగరంలోని మాంటిస్సోరీ ఏ క్యాంపు నందు వండర్ కార్నివాల్ ఘనంగా జరిగినది. ఇందులో ఐ కిడ్స్ విభాగము నందు గల విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఏరోబిక్స్, డ్రిల్, జింగిల్ బెల్, వివిధ జాతులకు సంబంధించిన వేషధారణలతో ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులకు కనువిందు కలిగించాయి.. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాంటిస్సోరి ఏ క్యాంపు పూర్వపు విద్యార్థులైన డాక్ట
ర్ మౌనిక, డాక్టర్ మానసలు … చిన్నారులలో ఉన్న ఆలోచన శక్తిని వారి సృజనాత్మకత ను వెలికి తీయడం ద్వారా జీవన నైపుణ్యాలు పెంపొందుతాయన్నారు. ఈ సందర్భంగా మాంటె స్కూల్ డైరెక్టర్ గాయని రాజశేఖర్ మాట్లాడుతూ చదువుతోపాటు విద్యార్థులలో దాగివున్న ప్రతిభను వెలికి తీయడం కోసం ఇలాంటి వండర్ కార్నివాల్ లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు మానసిక ఉల్లాసం తో పాటు మానసిక వికాసం కూడా పిల్లలలో పెంపొందుతాయన్నారు. సందర్భంగా కార్యక్రమంలో శ్రీమతి రాధరాణి, శశికళ, రమాజ్యోతి, కో- ఆర్డినెటేర్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్య సిబ్బంది పాల్గొన్నారు