
ఏఐ సమ్మెట్టులు కాంగ్రెస్ అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య
కర్నూలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీజేవైఎం రాష్ట్ర నాయకులు సునీల్ కుమార్ రెడ్ది
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీజేవైఎం నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకొని ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఫ్లెక్సీలను తొలగించారు..
రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను సైతం పార్టీ కార్యాలయం ముందు దగ్ధం చేశారు. రాష్ట్రంలో ఏఐ సమ్మెట్టులు కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యని దేశానికి పెట్టుబడులు పెట్టేందుకు ఏఐ సదస్సు జరుగుతుంటే కాంగ్రెస్ గుండాలు అడ్డుకున్నారంటూ బీజేవైఎం రాష్ట్ర నాయకులు నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు నిరసనలతో హోరెత్తించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి గుడ్లు టమోటాలు విసురుతూ పార్టీ ఫ్లెక్సీలను సైతం తొలగించారు దీంతో ఒక్కసారిగా పార్టీ కార్యాలయం ముందు భయాన్ భయానకర వాతావరణంతో పోలీసులు సైతం అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ పెద్ద ఎత్తున కర్రలు తీసుకొని ఫ్లెక్సీలను సైతం పగలగొట్టారు.

