బొలెరో నూతన వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ఎంపీ 

బొలెరో నూతన వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ఎంపీ 

   కర్నూలు ఎంపి బస్తిపాటి నాగరాజు, కర్నూలు జిల్లా ఎస్పీ

న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు జిల్లా పోలీసుశాఖకు ఎంపి ల్యాడ్స్ నిధులతో పోలీసుశాఖ కు 2 బొలెరో నూతన వాహానాలను కేటాయించారు. 2 బోలెరో నియో వాహనాలను జిల్లా పోలీసు కార్యాలయంలో కర్నూలు నియోజక వర్గం ఎంపి బస్తిపాటి నాగరాజు కలిసి కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు.జిల్లా వ్యాప్తంగా రాత్రి వేళల్లో పోలీసు గస్తీని పటిష్టంగా నిర్వహించడం ద్వారా నేర నియంత్రణకు చెక్‌ పెట్టాలనే ఉద్దేశ్యంతో శాంతిభద్రతల పరిరక్షణ లో భాగంగా ఎమర్జెన్సీ సమయాలలో వాహనాలను వినియోగించనున్నారని జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ పేర్కోన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. హుస్సేన్ పీరా, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, ఎఆర్ డిఎస్పీ భాస్కర్ రావు, స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్ , ఆర్ ఐ నారాయణ ఉన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!