చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసు డ్రోన్ కెమెరాతో గట్టి నిఘా

చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసు డ్రోన్ కెమెరాతో గట్టి నిఘా

19 ఒపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు.
 జిల్లాలో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్.

న్యూస్ వెలుగు, కర్నూలు క్రైమ్; జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ ఆదేశాల మేరకు కర్నూలు డిఎస్పీ జె.బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు పట్టణంలో నేర నివారణే లక్ష్యంగా పోలీసులు విజిబుల్‌ పోలీసింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ సంధర్బంగా ఆదివారం జి ల్లా కేంద్రంలోని కర్నూలు నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని శరీన్ నగర్ , వక్కేర వాగు, ఆర్టీసి బస్టాండ్ తదితర ప్రదేశాలలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల పై డ్రోన్ కెమెరా ద్వారా గట్టి నిఘా ఉంచారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 19 మందిని కర్నూలు ట్రాఫిక్ పోలీసులు, కర్నూలు నాల్గవ పట్టణ పోలీసులు కలిసి అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల పై , బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారి పై నిరంతరం పర్యవేక్షణ నిఘా కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్, కర్నూలు నాల్గవ పట్టణ ఎస్సై గోపినాథ్, ట్రాఫిక్ ఆర్ ఎస్సై హుస్సేన్ పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!