విధి నిర్వహణలో అంకిత భావం ముఖ్యం

విధి నిర్వహణలో అంకిత భావం ముఖ్యం

హర్షవర్ధన్ సేవలు చిరస్మరణీయం

మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి కే. హర్షవర్ధన్ పదవీ విరమణ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ ప్రసంగం

అమరావతి, న్యూస్ వెలుగు; ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగులుగా ప్రజలకు చేరువై, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అంకితభావంతో బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగులందరికీ సమాజంలో గుర్తింపు ఉన్నత స్థానంలో ఉంటుందని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. గురువారం మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి కే హర్షవర్ధన్ ఐఏఎస్ పదవీ విరమణ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. కార్యదర్శి హర్షవర్ధన్ ఈ నెల 31 న పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ సర్వసాధారణమని అన్నారు.విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో పని చేస్తే, వారి వ్యక్తిత్వానికి, క్రమశిక్షణతో కూడిన సేవలకు తప్పనిసరిగా గుర్తింపు ఏర్పడుతుందని అన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి కె.హర్షవర్ధన్ ప్రభుత్వ సర్వీసులో వివిధ హోదాల్లో అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. పదవి విరమణ అనంతరం భగవంతుని కృపాకటాక్షాలతో , ఆయురారోగ్యాలతో శేష జీవితం గడపాలని మంత్రి ఫరూక్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!