
టిడిపి ఆవిర్భావ దినోత్సవాన్ని పండగలాగే చేసుకోవాలి
హోళగుంద, న్యూస్ వెలుగు: నేడు మండల వ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను పండుగలాగే చేసుకోవాలి ఆలూరు టీడీపి యువ నాయకులు గిరి మల్లేష్ గౌడ పిలుపునిచ్చారు.గురువారం మండల కేంద్రంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో ఆలూరు తాలూకా ఇంచార్జీ వీరభద్ర గౌడ్ తనయుడు గిరి మల్లేష్ గౌడ్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా రేపు టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని మరియు అన్ని గ్రామాల్లో టీడీపీ జండా ఎగరవేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య,కూటమి పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!