16 నుంచి ధనుర్మాస పూజలు

16 నుంచి ధనుర్మాస పూజలు

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల ప్రజల ఆరాధ్యదైవం,కొండ గుహలో స్వయంభువుగా వెలసిన మరియు కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలిచే శ్రీ సిద్దేశ్వర స్వామి ధనుర్మాస పూజలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నట్లు వంశపారంపర్య ఆలయ ధర్మకర్త రాజపంపన్న గౌడ పాత్రికేయులకు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటలా ధనుర్మాసాని పురస్కరించుకుని ఈ నెల 16 నుంచి వచ్చే నెల 14వ తేదీవరకు దాదాపు నెల రోజుల పాటు ఆలయంలో ప్రతి రోజు తెల్లవారుజామున స్వామివారికి జలాభిషేకం, కుంకుమార్చన, పంచామృతాభిషేకం, బిల్వార్చన, ఆకుపూజ,మహామంగళ హారతి వంటి విశేష పూజలు జరుగుతాయని తెలియజేశారు

Author

Was this helpful?

Thanks for your feedback!