ప్లాస్టిక్ నిషేదిద్దాం

హోళగుంద,న్యూస్ వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలన పై సర్పంచ్ చలువాది రంగమ్మ అధ్యక్షతన కార్యదర్శి రాజశేఖర్ ప్రజలకు అవగాహన కల్పించారు.ముందుగా సచివాలయం సిబ్బంది,మహిళ సంఘాలతో ప్లాస్టిక్ నిర్మూలన పై స్థానిక బస్టాండ్ నందు అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చి సుందరమైన గ్రామం సాధనకు తమ వంతు కృషి చేయాలని కోరారు.మరియు స్వచ్ఛతకు అత్యంత పెద్దపీట వేయటంతో పాటు కార్యక్రమంలో ప్రజలని సైతం భాగస్వాములని చేయటం గొప్ప విషయమని తెలియజేశారు.అంతేకాకుండా హెబ్బటం గ్రామంలో సర్పంచ్ కృష్ణవేణి ఆధ్వర్యంలో కూడా అవగాహన ర్యాలీ చేపట్టారు,మండల కేంద్రంలోని సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రధానోపాధ్యాయుల చిదానంద విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తనయుడు పంపాపతి,నరసప్ప,ప్రధానోపాధ్యాయుడు రంగన్న,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!