
మెగా పిటిఎం సమావేశాలను విజయవంతం చేయండి
ఎంఈఓ రమా వెంకటేశ్వర్లులు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో శనివారం రోజున నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పిటిఎం) ను విజయవంతం చేయాలని తుగ్గలి మండల విద్యాధికారి రమా వెంకటేశ్వర్లు తెలియజేశారు.శుక్రవారం రోజున ఆయన మాట్లాడుతూ పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పిటిఎం మండలం లోని విద్యార్థుల తల్లిదండ్రులు,పాఠశాల పూర్వ విద్యార్థులు,గ్రామ పెద్దలు,వక్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మండల విద్యాశాఖ అధికారులు రమా వెంకటేశ్వర్లు, మాలతిలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అందరూ తప్పకుండా పాల్గొని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తమ అమూల్యమైన సలహాలు,సూచనలు అందించాలని వారు తెలియజేశారు.
Was this helpful?
Thanks for your feedback!