
పాండురంగ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన ఎం.పి బస్తిపాటి నాగరాజు దంపతులు
కర్నూలు, న్యూస్ వెలుగు; వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలోని పాండురంగ స్వామిని ఎం.పి బస్తిపాటి నాగరాజు దంపతులు దర్శించుకున్నారు.. దర్శనం నిమిత్తం ఆలయానికి చేరుకున్న ఎం.పి దంపతులకు మేళతాలలతో స్వాగతం పలికారు.. అనంతరం వారు పాండురంగ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.. ఈ సంధర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దేవున్ని ప్రార్థించినట్లు తెలిపారు..
Was this helpful?
Thanks for your feedback!