మా లక్ష్యం అందరికి వైద్యం : జెపి

మా లక్ష్యం అందరికి వైద్యం : జెపి

న్యూస్ వెలుగు అప్డేట్ :  దేశంలో అందరికి అందుబాటులో ఉండేలా వైద్య విధానాలను కేద్రం అందిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జెపి నడ్డా తెలిపారు. దేశంలో గర్భిణీ స్త్రీలకు టీకాలను అందించడం దగ్గర నుండి వారికీ మెరుగైన ప్రసూతి వైద్యం అందేవరకు అనేక విషాలను రోగులకు తెలిసేలా ఆశా వర్కర్లు ,  డిజిటల్ సేవలు అందిచేందుకు వీలుగా ప్రభుత్వం నుతన విధానాలను తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. లక్ష 77 వేలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు , ఇంద్ర ధనుస్సు పథకం ద్వారా 5.46  కోట్లమంది పిల్లలకు టీకాలు మరో 1.36 కోట్లమంది గర్భిణీలకు టీకాలు వేసినట్లు వెల్లడించారు. ప్రసూతి మరణాలు 86 శాతం తగ్గినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS