
మాదిగలకు ప్రభుత్వం కేటాయించిన అసైన్మెంట్ భూములకు రక్షణ కల్పించండి
మండలం తహసిల్దార్ చంద్రశేఖర్ గారిని కలిసి డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించిన
ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టిఎం రమేష్ మాదిగ
క్రిష్ణగిరి, న్యూస్ వెలుగు; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా క్రిష్ణగిరి మండలంలోని పలు గ్రామాలలో భూమిలేని ఉపాధి లేని నిరుపేదలకు దళితులకు ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా డి పట్టాలు మంజూరు చేసి భూములు కేటాయించడం జరిగింది ఈ భూములను కుల బలం ధన బలం ఆర్థిక బలం రాజకీయ బలం ఉన్నవారు దళితులకు ప్రభుత్వాలు కేటాయించిన దాదాపు 13 వేల ఎకరాల భూములకు రెవెన్యూ అధికారులు రికార్డులు ట్యాంపరింగ్ చేసి భూ కబ్జా అక్రమాలకు వెబ్ ల్యాండ్ నందు అడంగల్ వన్ బి ఎక్కించి అక్రమాలకు పాల్పడ్డారు ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన రెవెన్యూ అధికారులు భూకబ్జాదారులతో కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా దళితుల భూములకు వెబ్ ల్యాండ్ నందు అక్రమంగా అక్రమార్కులకు అడంగల్ వన్ బి ఎక్కించి బాధిత డిపట్టా దారులైన దళితులకు మోసం చేసి నేరపూరితమైన కుట్రకు పాల్పడ్డారు రికార్డులు ట్యాంపరింగ్ చేసిన అధికారులపై విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకొని దళితులకు కేటాయించిన ప్రభుత్వ అసైన్మెంట్ భూములకు రక్షణ కల్పించి బాధితుల పేర్లను ఆన్లైన్లో అడంగల్ వన్ బి నమోదు చేసి అక్రమంగా నమోదు చేసుకున్న అక్రమార్కుల పేర్లను అడంగల్ వన్ బి నందు రద్దు చేయాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించడమైనది.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ఎస్ కార్యనిర్వాకుడు ప్రకాష్ మాదిగ ఎమ్మార్పీఎస్ఎస్ నాయకులు పుల్లయ్య మాదిగ శివరాముడు మాదిగ తదితరులు పాల్గొన్నారు.