
రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమం..!
ముంబయి; ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవాధ్యక్షుడు రతన్ టాటా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ముంబయిలోని ఓ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇంతకు ముందు సైతం ఆరోగ్యంపై వార్తలు రాగా.. అధికారిక ట్విట్టర్ వేదికగా తెలిపుతూ.. వార్తలను ఖండించారు. ఐసీయూలో అడ్మిట్ అయ్యారన్న వార్తలను కొట్టిపడేశారు. ‘ఇటీవల నా ఆరోగ్యం గురించి వచ్చిన వార్తలు వట్టి పుకార్లేనన్నారు.
ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. వయసు సంబంధిత కారణాలతో రొటీన్ ఆరోగ్య సపరీక్షలు చేయించుకున్నానన్నారు. ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రెండు రోజుల వ్యవధిలోనే ఆయన పరిస్థితి విషమంగా ఉందని మరోసారి జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త. టాటా సన్స్ మాజీ చైర్మన్. టాటా గ్రూప్ చైర్మన్గా ఉన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం రెండు అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్ (2008), పద్మ భూషణ్ (2000) అవార్డులతో సత్కరించింది.