
పోలీసులకు పదోన్నతులతోనే గుర్తింపు, ఉత్సాహం
కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్
9 మంది ఎఎస్సైల కు ఎస్సైలుగా పదోన్నతులు
కర్నూలు, న్యూస్ వెలుగు; రాయలసీమ రేంజ్ లోని ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన 9 మంది ఎఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతులు రావడం జరిగింది.
ఈ సంధర్బంగా శుక్రవారం కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో పదోన్నతులు పొందిన ఎస్సైలు కర్నూలు రేంజ్ డిఐజి మర్యాదపూర్వకంగా కలిశారు.
పదోన్నతులు రావడం అభినందనీయమని , మిగిలిన సర్వీసును కూడా రిమార్కు లేకుండా పూర్తి చేయాలని , విధులలో మంచి ప్రతిభ కనబరచి మరిన్ని పదోన్నతులు పొందాలని ఎస్సైలకు కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ సూచించారు.
వీరందరూ 1991 బ్యాచ్ కు చెందిన వారు.
ఈ కార్యక్రమంలో డిఐజి మేనేజర్ విజయరాజు ఉన్నారు. కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయం, కర్నూలు .
Was this helpful?
Thanks for your feedback!