నర్సింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశం

  నర్సింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశం

న్యూస్ వెలుగు, కర్నూల్; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధనవంత్రి కాన్ఫరెన్స్ హాల్ లో పలు విభాగాలలో ఉండే నర్సింగ్ స్టాఫ్ , హెడ్ నర్స్, వార్డ్ ఇన్చార్జిలతో సమీక్ష సమావేశం నిర్వహించి పేషెంట్లకు అందుతున్న ట్రీట్మెంట్  తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు.ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి నర్సింగ్ సేవలు కీలకమని ఆసుపత్రిలో పలు విభాగాలలో ఉండే నర్సింగ్ సిబ్బంది ప్రతిరోజు ఆయా విభాగాలలో డాక్టర్స్ పాటు రౌండ్స్ లో పాల్గొనాలని నర్సింగ్ సిబ్బందికి ఆదేశించారు.ఆసుపత్రిలోని పేషంట్లకు మర్యాదపూర్వకంగా పలకరించి వారికి మెరుగైన వైద్య సేవలందించుటలో పాలుపంచుకోవాలని నర్సింగ్ సిబ్బందికి ఆదేశించారు.
ఆసుపత్రిలోని పలు విభాగాలలో ఉండే నర్సింగ్ సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యంగా వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమానికి డిప్యూటీ సూపరింటెండెంట్, డా. శ్రీరాములు, సి ఎస్ ఆర్ ఎమ్ ఓ, డా.వెంకటేశ్వరరావు, అడ్మినిస్ట్రేటర్, పి.సింధు సుబ్రహ్మణ్యం, నర్సింగ్ సూపరింటెండెంట్, సావిత్రిబాయి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.కిరణ్ కుమార్, న్యూ డయాగ్నస్టిక్ మెడికల్ ఆఫీసర్, డా.సునీల్ ప్రశాంత్, మరియు నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!