
తెలుగు లోగిళ్లలో సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలనిచ్చే పండుగ సంక్రాంతి
ఎస్ వి దంపతులు
కర్నూలు, న్యూస్ వెలుగు; మాజీ ఎమ్మెల్యే, కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ఎస్ వి మోహన్ రెడ్డి , ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మాజీ అధ్యక్షు రాలు ఎస్ వి విజయ మనోహరి, యువ కిశోరం ఎస్ వి జనక దత్తా రెడ్డి తమ స్వగృహం నందు భోగి పండుగను పురస్కరించుకొని బోగి మంట తో సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరములో వచ్చే తొలి పండుగగా సంక్రాంతిని జరుపుకుంటారని ఈ పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఈ పండుగ గ్రామీణ ప్రాంతాలలో రైతులు పండించిన పంటలు రావడం తో పాటు నగరాల లో స్థిర పడిన ప్రజలు కూడా పెద్ద ఎత్తున గ్రామ ప్రాంతాలకు తరలి వెళ్లి తమ కుటుంబ సభ్యులతో జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతి అని అన్నారు. ఈ సంక్రాంతి పండగ అందరి ఇళ్లలో ఆనందాలను నింపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్సార్సీపీ జిల్లా కార్యదర్శి షరీఫ్, కోశాధికారి కల్లా నరసింహ రెడ్డి సెక్రెటరీ సర్వేశ్వర రెడ్డి పత్తా బాషా , కల్లా నాగవేణి రెడ్డి , వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మరియు ఎస్వీ యూత్ పాల్గొన్నారు.