ఎన్ఎండి ఫిరోజ్ కి 50,000 చెక్కును అందజేసిన సర్వజ్ఞ స్కూల్ , సరస్వతి విద్యా మందిర్ కరస్పాండెంట్ నాగభూపాల్ రెడ్డి

ఎన్ఎండి ఫిరోజ్ కి 50,000 చెక్కును అందజేసిన సర్వజ్ఞ స్కూల్ , సరస్వతి విద్యా మందిర్ కరస్పాండెంట్ నాగభూపాల్ రెడ్డి

నంద్యాల, న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్  పిలుపుమేరకు నంద్యాల సర్వజ్ఞ స్కూల్ , సరస్వతి విద్యా మందిర్ కరస్పాండెంట్ జి నాగభూపాల్ రెడ్డి  ఆధ్వర్యంలో 50,000 రూపాయల చెక్కును విజయవాడ వరద బాధితులకు నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్  అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో వరదలు రావడం చాలా బాధాకరమైన విషయమని , చాలామంది ప్రజలు నిరుపేదలుగా మిగిలారని వారికోసం మా వంతు సహాయార్థం ఈ 50,000 అమౌంట్ ని సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేస్తున్నామని తెలియజేశారు అనంతరం ఎన్ఎండి ఫిరోజ్ వారిని అభినందించడం జరిగింది. అందరూ ఇలా ముందుకొచ్చి తమ వంతు సహాయ సహకారాలు వరద బాధితులకు అందించాలని పిలుపునివ్వడం జరిగింది . ఈ కార్యక్రమంలో నంద్యాల ప్రవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బిజ్జం సుబ్బారెడ్డి , నంద్యాల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీ బి భాస్కర్ , నంద్యాల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ టౌన్ ప్రెసిడెంట్ బాల మద్దిలేటి , అశ్వక్ అహ్మదు , దశరథ రామిరెడ్డి , నెరవాటి రోహిత్ , రాజేష్ తదితరులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!