వలస విద్యార్థి విద్యార్థినుల ఆశ కిరణం సీజనల్ హాస్టల్స్

వలస విద్యార్థి విద్యార్థినుల ఆశ కిరణం సీజనల్ హాస్టల్స్

 ఎస్ఐ బాల నరసింహులు,మండల విద్యాధికారి సత్యనారాయణ
హోళగుంద, న్యూస్ వెలుగు: వలస విద్యార్థిని విద్యార్థుల ఆశ కిరణం సీజనల్ హాస్టల్స్ అని ఎస్ఐ బాల నరసింహులు,మండల విద్యాధికారి సత్యనారాయణ. అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలో అంబేద్కర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మరియు వరలక్ష్మి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆధ్వర్యంలో రెండు సీజనల్ హాస్టల్ సెంటర్లను ఇరువురు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో రెండు సీజనల్ హాస్టల్స్ ద్వారా 100 మంది విద్యార్థిని విద్యార్థులను వలసలు వెళ్లకుండా నాణ్యమైన భోజనంతో పాటు విద్యను అందించుటకు ప్రభుత్వం చొరవ చూపడం గర్వించదగ్గ విషయం అన్నారు.సీజనల్ హాస్టల్స్ వలస విద్యార్థులకు ఆశకిరణాలుగా మిగిలిపోతాయని కొనియాడారు.విద్యార్థులు మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు,ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలన్నారు.అలాగే వలస వెళ్ళు తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వారి పిల్లలను సీజనల్ హాస్టల్ లో చేర్పించి చదువుకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు.అంతేకాకుండా సదరు సెంటర్లలో డిఎడ్,బిఎడ్ పూర్తి చేసిన వారిచే విద్య బోధన అందించడం జరుగుతుందన్నారు.కావున ఈ అవకాశాన్ని వలస విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపకులు సిహెచ్ నాగరాజు,డిఆర్డిఏ వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ సూర్య ప్రకాష్,మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్,సర్పంచ్ చలవాది రంగమ్మ తనయుడు పంపాపతి,వెలుగు సీసీ హనుమంతు,సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు దళిత సమాఖ్య మండల నాయకులు మల్లేష్,వీరేష్,లాల్ సాబ్,ఉపాధ్యాయులు,కేర్ టేకర్లు,హాస్టల్స్ సిబ్బంది,విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!