చైర్మన్ గా షేక్ యజాస్ అహ్మద్

చైర్మన్ గా షేక్ యజాస్ అహ్మద్

కర్నూలు, న్యూస్ వెలుగు;  కర్నూలు జిల్లా కాంగ్రెస్ (అనార్గనైజ్డ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ కాంగ్రెస్) అసంఘటిత కార్మికుల, ఉద్యోగుల కాంగ్రెస్ జిల్లా చైర్మన్ గా షేక్ యజస్ అహ్మద్ ని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు పి మురళీకృష్ణ గారి సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ కె కె సి చైర్మన్ కైపు వెంకటకృష్ణారెడ్డి గారు నియమించడమయినది. అనంతరం యజస్ అహ్మద్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నా మీద నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి గారికి మరియు రాష్ట్ర కేకేసి చైర్మన్ కైపు వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు కర్నూలు డిసిసి అధ్యక్షులు పి మురళీకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. యజాజ్ అహ్మద్ మాట్లాడుతూ జిల్లాలో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని కాంగ్రెస్ పార్టీ కేకేసి డిపార్ట్ మెంట్ ను కర్నూలు జిల్లాలో బలోపేతం చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడమే మా కర్తవమని ఈ సందర్భంగా ఎజాస్ అహ్మద్ హామీ ఇచ్చారు.

Author

Was this helpful?

Thanks for your feedback!