
కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి
మండల అధ్యక్ష ఉపాధ్యక్షులు తిరుపాల్ నాయుడు,వెంకట రాముడు చౌదరి
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చిన ఏడు నెలల కాల వ్యవధిలోనే కనివిని ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచంలోని అన్ని దేశాలు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వైపు చూసేలా మన రాష్ట్రంలో దాదాపు పద్దెనిమిది కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు 6,33,726,84 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టిస్తు దాదాపు 4,08,285 ఉద్యోగాలు కల్పించి రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాలలో ఉద్యోగ ఉపాధి కల్పించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత కేవలం ఎన్డిఏ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి శాఖ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తదితర మంత్రి మండలికే సాధ్యమని తుగ్గలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాంపల్లి ఆర్.తిరుపాల్ నాయుడు,తుగ్గలి మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు రాంపురం కొట్టాల పి.వెంకట రాముడు చౌదరిలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి ఆంధ్ర ప్రదేశ్ గా మార్చడానికి కంకణం కట్టుకున్నారని వారు తెలియజేశారు.రాష్ట్రంలోని ప్రజలకు అన్ని సంక్షేమ పథకాల అమలు చేస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులకు వివిధ కంపెనీలను ఆహ్వానిస్తూ ఉద్యోగాలను కల్పిస్తున్నారన్నారు. ఏడు నెలల వ్యవధిలోనే కోట్లలో పెట్టుబడులు,లక్షలలో ఉద్యోగాలు కల్పిస్తుంటే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఇటువంటి పెట్టుబడులు రాలేదనడం విడ్డూరంగా ఉందని వారు తెలియజేశారు.కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.