స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని మానుకోవాలి

స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని మానుకోవాలి

    ట్రూ ఆఫ్ చార్జీలు రద్దు చేయాలి

న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూల్ నగరంలోని శ్రీరామ నగర్ లో 23వ వార్డు సిపిఎం పార్టీ వార్డు కమిటీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు ఇళ్లకు పెట్టే విధానాన్ని మానుకోవాలి ట్రూ ఆఫ్ చార్జీలను రద్దు చేయాలని కోరుతూ రెండు ప్రాంతాలలో ప్రజలను సమీకరించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కరెంటు బిల్లుల దహనం చేసి ప్రభుత్వానికి నిరసనతెలియజేశారు. సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్. నరసింహులు నిరసన కార్యక్రమానికి హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నూతన ఎలక్ట్రిసిటీ విధానం వల్ల ట్రూ ఆఫ్ చార్జీలు, కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని వేశాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచినప్పుడు ప్రతిపక్ష తెలుగుదేశం కరెంటు చార్జీల పెంపును వ్యతిరేకించింది. ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు పెంచము అని వాగ్దానం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఐదు నెలలు గడవకముందే 20వేల కోట్ల రూపాయలు ప్రజల పై కరెంటు చార్జీల భారాలు వేయడానికి ఎలక్ట్రిసిటీ వారికి అనుమతులు ఇచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదాని కంపెనీ ద్వారా స్మార్ట్ మీటర్లు కొని వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించి ప్రతి ఇంటికి 12 వేల రూపాయలు అదనపు భారం పడే విధంగా చేస్తున్నాయి. దీనిని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ప్రస్తుత పాత మీటర్ విధానం వల్ల నెల ఐదో తారీకు బిల్లు ఇచ్చిన నెల 30వ తారీఖు వరకు గడువు ఉంటుంది. కానీ స్మార్ట్ మీటరు బిగిస్తే ముందుగానే డబ్బులు డిపాజి చేసి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల పేద,మధ్యతరగతి ప్రజలకు భారంగా మారుతుంది. వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన తెలుగుదేశం అదానీ ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడి స్మార్ట్ మీటర్లు బిగించడం చేస్తున్నది. ప్రజలను వంచించిన తెలుగుదేశం ప్రభుత్వానికి తగిన గుణపాఠం ప్రజలు చెబుతారని, ఇళ్ల దగ్గర స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకొని ట్రూ ఆఫ్ చార్జీలను రద్దుచేసి స్మార్ట్ మీటర్లు బిగించే విధానాన్ని మానుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కరెంటు చార్జీలు, ట్రూ ఆఫ్ చార్జీలు తగ్గించాలని,స్మార్ట్ మీటర్లు బిగించవద్దని సిపిఎం పార్టీ చేస్తున్న పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ వార్డు నాయకులు ఎస్.అజ్మత్, C.ఎల్లయ్య, వీధి పెద్దలు వెంకటేశ్వర రెడ్డి, C.కృష్ణ, వెంకటేశ్వర్లు,సత్యం, మహమ్మద్ గౌస్, అబ్దుల్లా, ఆర్. రాజు, రవి, సుబ్బరాయుడు, మహిళలు లీలావతి, R.నలిని, ఎస్. వాణి, ఆర్.వెంకటేశ్వరమ్మ, లక్ష్మీదేవి, నాగలక్ష్మి, రేష్మ, రాణమ్మ, సోమేశ్వరి, లక్ష్మి, మేరీ, శారద మొదలగు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!