
నంద్యాల జిల్లా వైయస్సార్సీపి మహిళ అధ్యక్షురాలుగా రాజంరెడ్డి సుజాతమ్మ
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు : నంద్యాల జిల్లా వైయస్సార్సీపి మహిళా అధ్యక్షురాలుగా బండి ఆత్మకూరు గ్రామానికి చెందిన వైయస్సార్సీపి సీనియర్ నాయకురాలు రాజంరెడ్డి సుజాతమ్మ ను నియమిస్తూ రాష్ట్ర కమిటీ ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాతమ్మ మాట్లాడుతూ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నియమించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ వ్యవస్థాపకుడు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని మహిళపై జరుగుతున్న అరాచకాలపై పోరాటం చేస్తానన్నారు. నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి అన్ని విధాలగా కృషి చేస్తానని తెలిపారు. పలువురు వైసిపి నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 JOURNALIST B SAIKUMAR NAIDU
 JOURNALIST B SAIKUMAR NAIDU