
ఘనంగా సెమి క్రిస్టమస్ వేడుకలు
గుంటూరు, న్యూస్ వెలుగు; సెయింట్ మేరీస్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ చేబ్రోలు ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హోలీ
మినిస్ట్రీస్ అధినేత పాస్టర్ దీవెనయ్య సెమి క్రిస్టమస్ ఉద్దేశించి తమ అమూల్య ప్రసంగాన్ని సెయింట్ మేరీస్ స్టూడెంట్స్ కి అందజేశారు. మానవ జ్ఞానం చేతకాక దేవుని జ్ఞానంచేత తమ జీవితాలను కొనసాగించాలని, జీవితంలో ఎదగటానికి మొదటిగా సమయపాలన ముఖ్యమని చదువును కష్టముతో కాకుండా ఇష్టముతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దేశ విదేశాల్లో సెయింట్ మేరీస్ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని ఆయన కొనియాడారు. ప్రిన్సిపల్ డాక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ మన కష్టాలను, పాపాలను మోయడానికి, మనలను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు జన్మించారని ఆ జన్మదిన వేడుకలే క్రిస్టమస్ వేడుకలని, మన కోసం ప్రాణం పెట్టి వెలుగునందించిన ఏసుక్రీస్తు పునరుద్దానుడయ్యాడని యేసును పోలిన జీవితాన్ని జీవించాలని నీవలే నీ పొరుగు వారిని ప్రేమించినట్లు మన జీవితం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆక్యుతెరపిస్ట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ మాట్లాడుతూ జీసస్ చెప్పిన సారం ప్రేమ, సేవ అని తన జీవితంలో జీసస్ ఎన్నో అద్భుత కార్యాలు చేశారని, ప్రతి ఒక్క విద్యార్థి చదువుతోపాటు సమాజానికి సేవ చేసే తత్వాన్ని పెంపొందించుకోవాలని, మన తల్లిదండ్రులు హర్షించే విధంగా మన జీవితాన్ని మనమే మార్చుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కాలేజీ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.