
కాలేజీపై తప్పుడు ప్రచారాలు మానుకోండి
Kadapa (జమ్మలమడుగు) న్యూస్ వెలుగు :  జమ్మలమడుగు పట్టణంలోని ప్రభుత్వ ఐటిఐ మైలవరం కాలేజీలో పని చేస్తున్న లెక్చరర్ కిరణ్ , ఇంచార్జి ప్రిన్సిపల్ నవరూప్ కుమార్ పై ఒక విద్యార్థి సంఘం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే  అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని  తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు కాలేజీ విద్యార్దులు తెలిపారు .ఈ విషయాన్నీ జమ్మలమడుగు పట్టణ రెవిన్యూ డివిజినల్ అధికారికి మైలవరం  ఐటిఐ  విద్యార్థులు  వ్రాత పూర్వకంగా వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని విద్యార్థులు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM