
బీసీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన అమలుపై సమీక్ష
బీసీల సంక్షేమంపై ఇచ్చిన హామీపై సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు
టీడీపీ నేతలు
న్యూస్ వెలుగు, కర్నూలు కార్పోరేషన్ : బీసీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధృష్టి పెట్టారని, ఇందులో భాగంగానే బీసీలకు లబ్ధి కలిగించేలా కార్యక్రమాలకు చేపట్టేందుకు చంద్రబాబునాయుడు భావిస్తున్నారని, బీసీలకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై సమీక్ష చేయడం శుభపరిణామమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వర రావు యాదవ్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ బీ.సి సెల్ పార్లమెంట్ అధ్యక్షులు సత్రం రామక్రిష్ణుడు, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ పోతురాజు రవికుమార్, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ధరూర్ జేమ్స్,రాష్ట్ర సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చింతమాను సురేంద్ర నాయుడు,జిల్లా బీసీ యూత్ అధ్యక్షులు కిరణ్ లతో కలిసి మంగళవారం కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటుచేశారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ వై.ఎస్ జగన్ బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని,బీసీలంటే బ్యాక్వర్డ్ కాదు బ్యాక్ బోన్ అంటూ మాటలు చెప్పి 2019 ఎన్నికల్లో గెలుపొందారని,వై.ఎస్. జగన్ నిర్లక్ష్యం కారణంగానే బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను 24శాతానికి కుదించి దాదాపు 16500 మంది రాజకీయ పదవులకు దూరం అయ్యారని అన్నారు. చంద్రబాబునాయుడు బీసీల రాజకీయ ఎదుగుదలకు గుర్తింపు ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగానే బీసీల అభ్యున్నతి కోసం 34శాతం రిజర్వేషన్ల సాధనకు సుముఖుత వ్యక్తం చేసినందున వారికి తెలుగుదేశం పార్టీ బీసీల తరపున కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలో ఉన్న బీ.సీ సంక్షేమ హాస్టళ్లలో బాలికల హాస్టళ్లను తక్షణమే మరమ్మతులు చేయాలని సీ.ఎం ఆదేశించారని,గత ప్రభుత్వం పెట్టిన రూ. 110కోట్ల డైట్ బిల్లల బకాయిల్లో ఇప్పటికే రూ. 76.38కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించిందని,ప్రభుత్వం చెల్లించగా పెండింగ్ లో ఉన్న రూ.34.14 కోట్లను త్వరలో చెల్లించాలని సీ.ఎం ఆదేశించారని అన్నారు. అలాగే 2024-25 సంవత్సర బడ్జెట్లో ప్రభుత్వం రూ.135కోట్లు కేటాయించిందని చెప్పారు.స్కిల్ ఎడ్యుకేషన్లో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్,సోషల్ ఎమోషనల్ స్కిల్స్, నైతిక విలువలు,నీతి శాస్త్రం,డిజిటల్ లిటరసీ,లీగల్ అవేర్నస్ వంటివి ఎస్.ఆర్ శంకరన్ నాలెడ్జ్ సెంటర్ల ద్వారా బీసీ విద్యార్థులకు అందించనున్నారని, 26 జిల్లాలలోని 104బీసీ హాస్టళ్ళలో పైలట్ ప్రాజెక్టులుగా అమలు చేయనున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవేంద్ర గౌడ్, వీరేష్,డి.వి.చంద్ర,జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ నాయుడు,సెక్రటరీ దేవేంద్ర గౌడ్,యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కిరణ్,జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్, తదితరులు పాల్గొన్నారు.