సైబర్ బారిన పడిన మహిళా

సైబర్ బారిన పడిన మహిళా

రూ.1.25లక్షలు రికవరీ,బాధితురాలికి అప్పగింత

కర్నూలు త్రీ టౌన్ పోలీసులు.

కృతజ్ఞతలు తెల్పిన బాధితురాలు

న్యూస్ వెలుగు, కర్నూలు క్రైం : కర్నూలు నగరం,బుధవార పేటకు చెందిన నస్రేనా సుల్తానా బాధితురాలు.ఆమె ఉద్యోగం కొరకు ఆన్ లైన్ లో ప్రయత్నిస్తున్న సందర్బంగా తెలంగాణ రాష్ట్రం. హైదరాబాద్ కు చెందిన అనిల్ యాదవ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి బాధితురాలు నస్రేనా సుల్తానాకు సైబర్ మోసానికి గురిచేశాడు.ఘటనపై గత నెల లో కర్నూలు జిల్లా ఎస్పీ నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలుజిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ కి ఫిర్యాదు చేసి విన్నవించారు.ఈ విషయంపై కర్నూలు జిల్లా ఎస్పీ కర్నూలు త్రీ టౌన్ పోలీసులకు ఆదేశాల మేరకు కర్నూలు త్రీ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతికతను ఉపయోగించారు. త్వరితగతిన కేసు పరిష్కారం చేసి బాధితురాలు పొగొట్టుకున్న రూ.1.24లక్షలు బుధవారం రికవరీ చేసి అందజేశారు.ఈ నేపథ్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) ద్వారా ఫిర్యాదులు స్వీకరించి,పరిష్కారం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్,కర్నూలు మూడవ పట్టణ పోలీసులకు బాధితురాలు కృతజ్ఞతలు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!