
మట్కా నియంత్రనే లక్ష్యంగా ముమ్మర తనిఖీలు
త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ సూర్య మౌళి
న్యూస్ వెలుగు, నంద్యాల; నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో భాగంగా మట్కా,జూదం మొదలగునవి నియంత్రించుటకు నంద్యాల 3 టౌన్ ఇన్స్పెక్టర్ సూర్య మౌళి, ఎస్సై సత్యనారాయణ సిబ్బంది సహాయంతో విశ్రుత తనిఖీలు చేయుచుండగా నంద్యాల టౌన్ నూనెపల్లి జిలేబి సెంటర్ వద్ద ఇద్దరు వ్యక్తులు మట్కా ఆడుటకు ప్రజలను ప్రేరేపించి వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేయు చేయుచుండగా పట్టుకుని అరెస్ట్ చేసి వద్ద నుండి మట్కాకు సంబందించిన చీటీలను 1,02,070 /- (అక్షరాల ఒక లక్ష రెండు వేల డెబ్బై )రూపాయలను తదుపరిచర్య నిమిత్తం స్వాదినం చేసుకోవడమైనది.
ముద్దాయి
1) షేక్ జమాల్ బాష S/o షేక్ మహమ్మద్ ముస్తఫా, వయస్సు 24 సంవత్సరములు r/o కొలిమిపేట, నూనెపల్లి నంద్యాల టౌన్.
2) బొగ్గు నాగేంద్రుడు @ చిన్న S/o బాలుడు , వయసు 39 బుక్కపురం, తిమ్మాపురం, మహానంది మండలం,
స్వాదినం చేసుకున్న నగదు
మట్కాకు సంబందించిన చీటీలను మరియు 1,02,070/-రూపాయల నగదు
త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ సూర్యమౌళి మాట్లాడుతూ ఎవరైన ప్రజలకు అధిక డబ్బులు వస్తాయని ఆశ చూపించి పేద ప్రజల జీవితాలను మట్కా అనే జూదం వైపు మరల్చి వారి జీవితాలను నాశనం చేయుటకు పాల్పడిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.