పరీక్ష పే చర్చా 100% నమోదవ్వాలి 

పరీక్ష పే చర్చా 100% నమోదవ్వాలి 

న్యూస్ వెలుగు, కర్నూలు; కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టిన పరీక్ష పే చర్చా లో దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నమోదవుతున్నారు. ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ  ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తరుణంలో కర్నూలు జిల్లాలో నమోదు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. డిసెంబర్ 14వ తేది నుండి జనవరి 14 వరకు ఈ పోటీలలలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఈ పోటీ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ ప్రశ్నలను దేశ ప్రధానికి తెలియజేయడానికి నిర్వాహకులు షార్ట్ లిస్ట్ చేసిన ప్రశ్నలు ప్రోగ్రామ్ లో ఉంటాయి. ఈ నేపధ్యంలో, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులలో పరీక్ష ఒత్తిడిని తగ్గించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి, ప్రోత్సహించడానికి పాఠశాలలు వినూత్న చర్యలను అవలంబించాలని సీబీఎస్ఈ ఇప్పటికే కోరింది. ఈ పోటీకి గరిష్ట సంఖ్యలో విద్యార్థులు నమోదు అయ్యేలా చూడాలని గతంలో యంఈఓ మరియు ప్రధానోపాధ్యాయులను సమావేశాలు నిర్వహించి అన్ని స్థాయిలలోని అధికారులను ఆదేశించడమైనది. మార్గదర్శకాలను కూడా అందరికీ పంపడమైనది. ఈ విషయం పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాబోయే మూడురోజుల్లో 6వ తరగతి నుండి ప్రతి విద్యార్థి, ఉ పాధ్యాయులు నమోదవ్వాలి. 2025 జనవరిలో ఢిల్లీలోని భారత్ మండపంలో పరీక్షా పే చర్చా 2025 జరగనుంది. ఈ పరీక్ష పే చర్చా (పీపీసీ) 8వఎడిషన్ లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ముఖాముఖి మాట్లాడుతారు. విద్యార్థులు తమ కలలు, లక్ష్యాలను సాధించడానికి సహాయపడటానికి, వారికి మద్దతు ఇవ్వడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సంభాషిస్తారు. ఈ అవకాశం మన జిల్లాకు రావచ్చు. కావున రాబోయే మూడురోజులు శనివారం 33% సోమవారం 33% మంగళవారం 34% మొత్తం జనవరి 1 నాటికి 100% పూర్తిచేయాలని ఆదేశించడమైనది.యస్ శ్యామ్యూల్ పాల్,జిల్లా విద్యాశాఖాధికారి, కర్నూలు.

Author

Was this helpful?

Thanks for your feedback!