
కొత్త పథకం తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం..! ఎస్ వి మోహన్ రెడ్డి
ఎస్ వి మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు
న్యూస్ వెలుగు, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల కన్నా ముందు ప్రతి కార్యక్రమంలో కరెంటు చార్జీలు పెంచబోమని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే అవన్నీ మర్చిపోయి కరెంటు చార్జీలు పెంచి దాదాపు 15 వేల కోట్ల రూపాయలు ప్రజలపై రుద్దడం జరిగిందని ఇది పూర్తిగా అన్నారు శుక్రవారం ఉదయం స్థానిక ఎస్టీ బీసీ కళాశాల నుంచి నరసింహారెడ్డి నగర్ లో ఉన్న విద్యుత్ కార్యాలయం వరకు మేయర్ బి వై రామయ్య, అహ్మద్ అలీ ఖాన్, సురేంద్ర రెడ్డి , వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే దాదాపు 75 వేల కోట్ల రూపాయల అప్పు చేశారని దాదాపు సంక్షేమ కార్యక్రమాలకు మంగళం పాడాలని అందులోని 15 వేల కోట్ల రూపాయలు విద్యుత్ డిస్క్ములకు చెల్లిస్తే రేట్లు పెంచవలసిన అవసరం ఉండదని ప్రభుత్వాని హితవు పలికారు వైపు రైతులకు బకాయిలు చెల్లించకుండా, విద్యార్థులకు రియంబర్స్మెంట్ చెల్లించకుండా జలను తీవ్ర ఇబ్బందుల గురి చేస్తున్నారని త్వరలోనే ప్రజా వ్యతిరేకతను కూటం ప్రభుత్వం రుచి చూస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట మేయర్ బి వై రామయ్య అహమ్మద్ అలీ ఖాన్ గారు సురేందర్ రెడ్డి వైఎస్ఆర్సిపి అనుబంధ సంఘాల నాయకులు సీనియర్ కార్యకర్తలు కార్పొరేటర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు