
రైతుల భూసమస్యలు పరిష్కరించడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యం
ఆర్డీవో నాగజ్యోతి
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: రైతులకు భూసమస్యలు పరిష్కరించడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమని ఆర్డిఓ నాగజ్యోతి అన్నారు. శనివారం మండలంలోని ఎర్రగుంట్ల గ్రామంలో రెవిన్యూ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో నాగజ్యోతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సుల ద్వారా గ్రామాల్లో దీర్ఘకాలికంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి రైతులకు ఒక చక్కటి అవకాశం అని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రైతులకు ఏ సమస్య వచ్చినా రెవిన్యూ అధికారులు అందుబాటులో ఉంటారని వారు అన్నారు ప్రజల నుంచి భూ సంబంధిత సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించి త్వరగతిన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ గ్రామంలో రైతుల నుంచి భూ సమస్యలపై 14 అర్జీలు వచ్చాయని ఎమ్మార్వో పద్మావతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రెహమాన్ సర్వే ఇన్స్పెక్టర్ రవీంద్రపాల్ మండల సర్వేయర్ పర్వీన్ వీఆర్వో వెంకటేశ్వర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.