
ఏపీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
న్యూస్ వెలుగు, కర్నూలు; ఏపీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నీ ఏర్పాటు చేయాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కర్నూల్ రీజినల్ కోఆర్డినేటర్ ఓబులేసు ప్రభుత్వాన్ని కోరారు. నేడు ఆదివారం కర్నూల్ సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. భారతదేశంలో మొట్టమొదటిది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రాలకు హైదరాబాద్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి కార్యకలాపాలు జరిగే వని తెలిపారు. ఇప్పుడు తాత్కాలికంగా నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పూర్తిగా ఏపీలో ఎలాంటి నోటిఫికేషన్ లేవన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 2024 25 విద్యా సంవత్సరానికి జనవరిలో ప్రవేశాలు చేపట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు. సార్వత్రిక విద్య ద్వారా ఉన్నత విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కి సంబంధించి ఉపాధ్యాయులకు సిబ్బందికి వేతనాలు నిలిచిపోయాయని వెంటనే ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హనుమంతప్ప, ప్రొఫెసర్ ఘన రెడ్డి, ప్రొఫెసర్ మురళీధర్, ప్రొఫెసర్ బడే సాబ్ పాల్గొన్నారు.