
తుంగభద్ర ప్రాజెక్టు ఛైర్మెన్ ను కలిసిన దూదేక సంఘం నాయకులు
హోళగుంద, న్యూస్ వెలుగు: తుంగభద్ర ప్రాజెక్టు ఛైర్మెన్ టీప్పు సుల్తాన్ ను మండల దూదేకుల సంఘం నాయకులు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయన శాలువ పూలమాలలతో సత్కరించారు.అనంతరం నాయకులు ఎలెల్సి బోర్డు చైర్మన్ తో మాట్లాడుతూ దూదేకుల కులానికి చెందిన టిప్పు సుల్తాను తుంగభద్ర ప్రాజెక్టు ఛైర్మెన్ గా ఎన్నుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.సాగునీటి పై చర్చించినట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నీటి సంఘం ఉపాధ్యక్షులు సిద్ధిక్ సాబ్,పిరన్న,హుస్సేన్ పీర, సులేమాన్,బడే సాబు,వన్నూరు సాబ్,పాకీర్ సాబ్,హుస్సేన్ పీర తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!