
లైబ్రేరియన్ మద్దిలేటిని కఠినంగా శిక్షించాలి
ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా గర్ల్స్ కన్వీనర్ కే.సంయుక్త
ఎమ్మిగనూరు బనవాసి, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బనవాసి గురుకుల కళాశాలలో విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన లైబ్రరీను కఠినంగా శిక్షించాలి. వ్యాయామ ఉపాధ్యాయురాలిని కూడా విధుల నుంచి తొలగించాలి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన లైబ్రేరియన్ విద్యార్థినిలు పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చాలా బాధాకరం. విద్యార్థినిపై లైంగిక దాడికి సహకరించిన ప్రిన్సిపల్ ని కూడా శిక్షించాలి. చదువుకోవడం కోసమని విద్యార్థిని లైబ్రరీకి వస్తే చదువుకునే సమయంలో లైంగికంగా వేధించడం చాలా దుర్మార్గమైన చర్య. రోజురోజుకీ విద్యార్థినీలకు రక్షణ లేకుండా రాష్ట్రంలో పరిస్థితులు నెలకొంటున్నాయి. మనం చూసాం ఈ మధ్య కాలంలోనే విశాఖపట్నం లా విద్యార్థినిపై , నందికొట్కూరులో సంఘటనలు , ఇలా చాలా ప్రదేశాల్లో విద్యార్థినీలకు రక్షణ లేకుండా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థినీయులపై లైంగిక దాడులు జరుగుతున్న కఠిన చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. హోం మంత్రి మహిళ కానీ విద్యార్థినీయులపై అఘాయిత్యాలు జరిగినప్పుడు మాత్రం నిందితులను శిక్షించడంలో బాధితులకు న్యాయం చేయడం లేదు. మన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళలకు రక్షణ రాష్ట్రంలో బాగా ఉందని చెబుతారు కానీ రోజు రోజుకి మహిళలకు రక్షణ కరువైపోతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థినీలపై లైంగిక దాడులు అఘైత్యాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరుకుంటున్నాను.