
వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి
కూటమి ప్రభుత్వం10 వాలంటీర్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
న్యూస్ వెలుగు, కర్నూలు; కూటమి ప్రభుత్వం వాలంటీర్స్ ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి వారి పెండింగ్ జీతాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వాలంటరీ అసోసియేషన్ (ఏఐవైఎఫ్ అనుబంధం) రాష్ట్ర సమితి పిలుపుమేరకు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు వాలంటీర్స్ తో కలిసి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో బిక్షటన నిర్వహించి వచ్చిన డబ్బులను సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపించి అనంతరం వెనకకు నడుస్తూ నిరసన తెలియజేశారు .ఈ కార్యక్రమానికి వాలంటీర్స్ అసోసియేషన్ నాయకులు కుమార్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు వాలంటీర్స్ నూర్ అహ్మద్, విజయ్ కుమారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వం చెప్పిన ప్రతి పని చెయ్యడమే కాకుండా కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి రాష్ట్ర ప్రజలకు సేవలందించారని అలాంటి వాలంటీర్స్ ని ఒక పార్టీకి అంటగట్టడం సరికాదన్నారు రాష్ట్రంలోని మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతూ వాలంటీర్స్ వ్యవస్థలో లేరని జీవోలు లేవని అవాక్కులు చేవాక్కులు పేలుతున్నారు అయితే వ్యవస్థలో లేకపోతే విపత్కర పరిస్థితుల్లో వాలంటీర్స్ తో ఏ విధంగా పని చేయించారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే పదవులు మంత్రి పదవులు అనుభవించిన రాజకీయ నాయకులను టిడిపి జనసేన పార్టీలో చేర్చుకుంటూ వారిని పొగుడుతున్నారని అయితే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న వాలంటరీలను మాత్రం వైసిపికి అంటగట్టడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు వాలంటరీ వ్యవస్థ పట్ల నిర్లక్ష్యం విడనాడి వాలంటీర్లను కొనసాగించడంతోపాటు వారికి పెండింగ్ జీతాలను చెల్లించాలని గౌరవ వేతనం 10 వేలు రూపాయలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు గత ఏడు నెలలుగా వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా 2, లక్షల 60 వేల మంది వాలంటీర్స్ కుటుంబ సభ్యులు ఐదేళ్లపాటు వారు సేవలందించిన ప్రజలను కలుపుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర నాయకులు కృష్ణ, చంటి, అఖిల్ , వాలంటీర్స్ రామాంజినేయులు, రాజశేఖర్, రవి, విజయ్, శివ, మనోజ్, అశోక్, గౌసియా,మమతా రాణి, గోవిందమ్మా, గౌతమి, మినకుమారి, రెస్మా, తార, సురేఖ, సోమేశ్వరి,రాణి,ప్రభావతి, సువర్ణ, ప్రభాకర్, రాము తదితరులు పాల్గొన్నారు