
రజకుల సమస్యలు పరిష్కరించాలి
న్యూస్ వెలుగు, కర్నూలు; రజకులకు సామాజిక రక్షణ చట్టం తీసుకుని రావాలని కర్నూలు లో రజక ఆ హ హ హ వృత్తిదారులు డిమాండ్ చేశారు. నగరంలోని కార్మిక కర్షక భవనంలో ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు పై సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమంలో వారు మాట్లాడుతూ రజకులకు రక్షణ లేదని అందువల్ల ఎస్సీ ఎస్టీల చట్టం రజకులకు సైతం వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. రజక కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజకులకు 250 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాలని కొరారు. ప్రభుత్వ శాఖల్లో దోబి ఉద్యోగాలకు సంబంధించిన కాంట్రాక్టు ఉద్యోగాలను రద్దు చేసి రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను వారు ఆవిష్కరించారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar