ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన ఎన్నికల సంఘం

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన ఎన్నికల సంఘం

ఢిల్లీ : దేశ రాజధాని డిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్‌, వచ్చే నెల 8న కౌంటింగ్‌ జరగనుంది. 70 మంది సభ్యుల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం మంగళవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.

మంగళవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, జనవరి 10న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, నామినేషన్ వేసేందుకు ఈ నెల 17 చివరి తేదీ అని తెలిపారు. దేశ రాజధానిలో కోటి 55 లక్షల మంది ఓటర్ల కోసం 13 వేల 33 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కుమార్‌ తెలిపారు. ఈసారి ఢిల్లీ ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు వేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈవీఎం ట్యాంపరింగ్, సాయంత్రం 5 గంటల తర్వాత ఓటర్ల సంఖ్య పెరగడం, కౌంటింగ్ ప్రక్రియ మందగించడం వంటి ఆరోపణలను ప్రధాన ఎన్నికల కమిషనర్ ఖండించారు. ఈవీఎంలు ఫూల్‌ప్రూఫ్ డివైజ్‌లని, ఓటర్ల డేటాను మార్చడం అసాధ్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఎన్నికలలో భారతదేశం బంగారు ప్రమాణమని ఆయన నొక్కి చెప్పారు.

ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం వచ్చే నెల 23తో ముగియనుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 62 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

Author

Was this helpful?

Thanks for your feedback!