
ఏ.కోడూరులో పొలం పిలుస్తుంది కార్యక్రమం
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: మండలంలోని ఏ.కోడూరు గ్రామంలో మంగళవారం వ్యవసాయ అధికారి స్వాతి ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు పంటలు వేసుకుని మొదలు పంట నూర్పులు చేసేంతవరకు ఎప్పటికప్పుడు స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు తీసుకోని అధిక దిగుబడులు సాధించాలన్నారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోని రైతులు రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల పై దృష్టి సారించాలని తద్వారా వేసిన పంటలలో పెట్టుబడులు తగ్గి అధిక దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 JOURNALIST B SAIKUMAR NAIDU
 JOURNALIST B SAIKUMAR NAIDU