
ఎస్సి,ఎస్టీ కేసు పై పత్తికొండ డిఎస్పీ విచారణ
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రానికి చెందిన హరిజన మల్లేష్ అనే వ్యక్తి అలాబకాష్ అనే వ్యక్తి పై దుకాణం గొడవ విషయంలో పై ఫిర్యాదు చేశాడు.కోర్టు ఎండార్స్ మెంట్ ప్రకారంగా ఎస్సి,ఎస్టీ కేసు నమోదు అయ్యింది.దీంతో బుధవారం పత్తికొండ డిఎస్పీ వెంకటరామయ్య ఎస్సి,ఎస్టీ కేసు పై విచారణ చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ బాల నరసింహులు, విఆర్ఓ తిప్పన్న,మల్లేష్,పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్,సర్పంచ్ తనయుడు పంపాపతి,పోలీస్ సిబ్బంది,గ్రామ సేవకులు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!