
శ్రీవారిని దర్శించుకున్న 22.33 లక్షల మంది
Tirupathi : తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం శుక్రవారం నిర్వహించినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. జులై నెలలో 22.33 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు వెల్లడించారు. ఈవో భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవాణి దర్శన టికెట్లను పరిమితం చేసినట్లు పేర్కొన్నారు. శ్రీవాణి దర్శన టికెట్లు రోజుకు వెయ్యి మాత్రమే జారీ చేస్తున్నట్లు ఈవో శ్యామలరావు మీడియా ముఖంగా తెలిపారు. అన్నప్రసాదాల్లో నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాంచినట్లు తెలిపారు. దళారీ వ్యవస్థ నిరోధకానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం తోపాటు గతంలో సర్వదర్శన టోకెన్లు నెలకు 1.07 లక్షలు జారీ చేసేవారని వెల్లడించారు. జులైలో 1.47 లక్షల సర్వదర్శన టోకెన్లు జారీచేశామని ఈవో శ్యామలరావు పేర్కొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Anji Ramu
 Anji Ramu