
పేద ప్రజల ఇంటి స్థలాల సమస్యలను పరిష్కారించాలి
ప్రభుత్వమిచ్చిన హామీలను నెరవేర్చాలని తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా.
సిపిఐ మండల కార్యదర్శి సుల్తాన్.
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: పేద ప్రజల ఇంటి స్థలాల సమస్యలను పరిష్కారించాలని నేడు ఉదయం 10 గంటలకు తహసిల్దార్ ఎదుట ధర్నాను నిర్వహిస్తున్నట్లు సిపిఐ మండల కార్యదర్శి సుల్తాన్ తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయాల నందు గత నెలలో ఇల్లు మరియు ఇళ్ల స్థలాల కోసం నిరుపేదలు అర్జీలను అందజేసినా అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించలేదని ఆయన తెలియజేశారు.ప్రజలిచ్చిన అర్జీలు కార్యరూపం దాల్చాలని శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు ఇళ్ల స్థలాల కోసం అర్జీలు అందజేసిన అర్జీదారుల సమక్షంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.అదేవిధంగా ఎన్నికలలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆయన తెలియజేశారు.పట్టణాలలో రెండు సెంట్లు,గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్ల స్థలం ఇచ్చి లబ్ధిదారులకు పక్కా ఇల్లు నిర్మాణం కొరకు ఐదు లక్షలు ఇవ్వాలని ఆయన తెలియజేశారు. కావున శుక్రవారం రోజు జరిగే ధర్నా కార్యక్రమంలో అర్జీదారులందరూ తప్పకుండా హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.