వర్గీకరణకోసం అలుపెరగని పోరాటం చేశాం ….!రామకొండ వెంకటేష్

వర్గీకరణకోసం అలుపెరగని పోరాటం చేశాం ….!రామకొండ వెంకటేష్

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు పత్తికొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ..  ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై ఏళ్లుగా అనేక పోరాటాలు చేశామన్నారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం తరవాత రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా మాదిగలు ఎదగలంటే ఎస్సీ వర్గీకర తప్పనిసరని గ్రహించిన మాదిగలు దేశవ్యాప్తంగా అనేక పోరాటాలను ఉదృతం చేయడం జరిగిందన్నారు. మాదిగల అభివృద్దికొసం ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు జోలె పట్టుకుని ఎండనక, వాననక , తిండి తిప్పలు మాని ఉద్యమం కోసం శ్రమించమన్నారు. రాజకీయంగా అనేక మంది ఎమ్మార్పీఎస్ ను అనగతొక్కేనదుకు  కుట్రలు పన్నారని , మాదిగలు  ఉద్యమాలు చేస్తే లాటిచార్జ్ చేసిన ఘటనలు లెక్కపెట్టలేనివని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష్య సాదింపులతో అనేక మంది ఎమ్మార్పీఎస్ నాయకులు జెయిల్లోమగ్గరన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్యమంలో అనేక సంఘటనలు నిద్రకుడా పట్టనివ్వమన్నారు. ఎట్టకేలకు గురువారం భారత అత్యున్నత న్యాయస్థానం ఏళ్ల తరువాత  తీర్పును వెల్లడించింది. ఏడుగురు సభ్యులతో కూడాని   ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ వీరికి తప్పనిసరి చేస్తూ వర్గీకరణ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకునేల తీర్పును వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణకు సహకరించిన టిడిపి, జనసేన, కాంగ్రెస్ వంటి పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రనాయకులు రామకొండ వెంకటేశ్ , జిల్లా నాయకులు  పులికొండ, తుగ్గలి మండల కన్వీనర్  బీమన్న , కాల రంగస్వామి , నరసింహులు , రోల్లాపాడు వెంకటేష్ (సిపిఐ ), ముత్యాల ఈశ్వరయ్య     తదితరులు నాయకులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!