బస్సు ప్రమాదంలో ఐదుగురు మృతి

బస్సు ప్రమాదంలో ఐదుగురు మృతి

ఉత్తరాఖండ్‌:  పౌరీ గర్వాల్ జిల్లా సిరౌలీ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బస్సులో 25 మంది ఉన్నారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు మరియు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS