
పరమటూరులో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
బండి ఆత్మకూరు, వెలుగు న్యూస్: బండి ఆత్మకూరు మండలంలోని పరమటూరు గ్రామంలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక టిడిపి నాయకుడు సాయిబాబా రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకుడు సాయిబాబా రెడ్డి మాట్లాడుతూ సాధారణ సభ్యత్వం కాకుండా రూ.100 చెల్లించి తీసుకునే క్రియాశీలక సభ్యత్వానికి పార్టీ అదనపు ప్రయోజనాలు కల్పిస్తోంది. ఈ సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 5 లక్షలు ప్రమాద బీమా వర్తిస్తుంది. సాధారణ మరణం సంభవిస్తే వారికి పార్టీ రూ. 10 వేలు చొప్పున చెల్లిస్తుందని అన్నారు. ప్రజల స్వచ్ఛందంగా టిడిపి సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటివరకు 416 టిడిపి సభ్యత్వాలు నమోదు చేశామన్నారు.
Was this helpful?
Thanks for your feedback!