ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు దేశ నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు దాదాపు 16 శాతం పెరిగి దాదాపు 16 లక్షల 90 వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ప్రకారం, స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు కూడా దాదాపు 20 శాతం ఆకట్టుకునే వృద్ధిని సాధించి 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో వసూలు చేసిన సుమారు 17 లక్షల కోట్ల రూపాయలతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. కార్పొరేట్ పన్ను దాదాపు పది లక్షల కోట్లు అందించగా, నాన్-కార్పోరేట్ పన్ను దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు.
