పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు జిల్లాస్థాయి పోటీలు

పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు జిల్లాస్థాయి పోటీలు

కర్నూలు, న్యూస్ వెలుగు; పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ జిల్లా స్థాయి పోటీల్లో జిల్లాలోని దివ్యాంగులు అందరూ పాల్గొనాలని కూడా చైర్మన్ సోమిరెడ్డి వెంకటేశ్వర్లు కోరారు. ఈపోటీలకు సంబంధించిన గోడ పత్రులను తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో విభిన్నప్రతిభావంతుల సమక్షంలో సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈసందర్భంగా సోమిశెట్టి మాట్లాడుతూ దివ్యాంగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఫింక్షన్ పెంచడం జరిగిందని వారిని మరింత ప్రొత్సహాం కలిగించేలా క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో విజేతలు రాష్ట్ర స్థాయిలో ఈనెల 30వ తేదీ మంగళగిరిలో క్రీడా పొటీలు నిర్వహిస్తారని సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈకార్యక్రమానికి పారా స్పోర్ట్స్ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఎంతో అండగా ఉందని రాష్ట్ర స్థాయిలో విజేతలకు లక్ష యాభై వేల రూపాయల నగదు ఇస్తున్నారన్నారు. ఈకార్యక్రమంలో సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎల్లప్ప, రవి, నాగేంద్ర, రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!