నందమూరి తారక రామారావు వర్ధంతిని  జిల్లా అంతటా భారీఎత్తున నిర్వహించాలి

నందమూరి తారక రామారావు వర్ధంతిని జిల్లా అంతటా భారీఎత్తున నిర్వహించాలి

  జిల్లా టిడిపి అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి

కర్నూలు, న్యూస్ వెలుగు; ఈ నెల 18వ తేదీన శనివారం తెలుగు చలనచిత్ర నటులు, తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమాన్ని కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గములు, మండలాలు, గ్రామాలలో నిర్వహించవలసినదిగా కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి తెలుగుదేశం పార్టీ మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, నియోజకవర్గం ఇన్చార్జీలు, రాష్ట్ర / జిల్లా స్థాయిలో పార్టీలో వివిద హెూదాలలో కొనసాగుతున్న నాయకులకు, కార్యకర్తలకు అబిమానులకు విజ్ఞప్తిచేశారు.
శుక్రవారం  పత్రికల వారితో మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీని స్థాపించి, 9 నెలలో రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొని వచ్చి, అట్టడుగు వర్గాల రాజకీయంగా ప్రోత్సాహించి, వారిని ఉన్నతస్థాయికి తీసుకొని వచ్చిన మహానేత యన్.టి.ఆర్. తెలుగువారికి ప్రత్యేక గుర్తింపును తీసుకొని వచ్చిన నందమూరి తారక రామారావు 29 వ ర్ధంతి తేది 18-01-2025 కర్నూలు జిల్లా అంతటా భారీఎత్తున నిర్వహించేందుకు ప్రతిఒక్కరు పాలుపంచుకోవాలనీ, ఈ సందర్భంగా రక్తదాన శిభిరాలను ఏర్పాటు చేయాలనీ, అలాగే అన్నదాన కార్యక్రమాలు, హాస్పటల్స్ నందు రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ వంటి సామాజిక కార్యక్రమాలను చేపట్టవలసినదిగా మన పార్టీ అదినేత చంద్రబాబునాయుడు ఆదేశమనీ, అందువల్ల ప్రతి నియోజకవర్గంలో సంభందిత యం.యల్.ఎ.లు, ఇన్చార్జీలు, అలాగే మండలస్థాయిలో పార్టీ మండల అధ్యక్షులు, ప్రధానకార్యదర్శులు, క్లిష్టర్, యూనిట్, బూతిస్థాయిల ఇన్చార్జీలు మీమీ పరిధిలో నిర్వహించి యన్.టి.ఆర్. ఉన్న అభిమానాన్ని చాటుకోవాలనీ, అలాగే యన్.టి.ఆర్.యన్.బి.కె. ఫ్యాన్స్ కూడా ఈ కార్యక్రమాలలో పాలుపంచుకొని తమ ఐక్యతను చాటుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
పాలకుర్తి తిక్కారెడ్డి
తెలుగుదేశంపార్టీ పార్లమెంట్ అధ్యక్షులు, కర్నూలు.

Author

Was this helpful?

Thanks for your feedback!