
ఆదోని డిపో అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్ది సంఘ నాయకులు
Holagunda (హోళగుంద): మండల పరిధిలో పెద్దహ్యట గ్రామానికి ఆదోని డిపో నుండి బస్సులు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ మ్యానేజర్ మహమ్మద్ రఫీ తెలిపారు. దీనిద్వారా విద్యార్దులకు , ప్రజలకు మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు అందుతాయని వారు అన్నారు. పోరాట ఫలితంగా పెద్దహ్యట గ్రామానికి బస్సు ఏర్పాటు చేసినట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరంగ తెలిపారు. ఇందుకు సహకరించిన ఆదోని డిపో అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. దీనివల్ల విద్యార్దులు సకాలంలో విద్యను అభ్యసించేనదుకు రవాణా సౌకర్యాలు ఎంతగానో దోహద పడుతాయన్నారు. ఈ కార్యక్రంలో ఆదోని డిపో మేనేజర్ మహమ్మద్ రఫీ,అసిస్టెంట్ మేనేజర్ రాఘవేంద్ర, విద్యార్దులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Anji Ramu
 Anji Ramu