
పెరవలి గ్రామం నందు భూ రీసర్వే పనులు ప్రారంభం
మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: మద్దికేర మండల పరిధిలోని గల పెరవలి గ్రామం నందు భూ రిసర్వే పనులు ప్రారంభమయ్యాయని తహసిల్దార్ హుస్సేన్ సాహెబ్ తెలియజేశారు. సోమవారం రోజున ఆయన మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మూడవ విడత పైలెట్ ప్రాజెక్టు ద్వారా పెరవలి గ్రామం ఎంపికైందని,అధికారుల ఆదేశాల మేరకు గ్రామ ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన అనంతరం సోమవారం నుండి రీసర్వే పనులను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.పెరవలి గ్రామం నందు భూ రిసర్వే పనులను మద్దికేర తహసిల్దార్ హుస్సేన్ సాహెబ్ పూజ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లికార్జున,వీఆర్వోలు బాలవర్ధి రాజు,మల్లికార్జున,మండల విలేజ్ సర్వేయర్లు,తలారి పీరా,వలి, రంగస్వామి,గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!